చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకోవడం బాధను కలిగించింది: రష్మిక మందన్న

  • హిందీలో బిజీ అయిన రష్మిక
  • చిరంజీవి 'ఆచార్య'లో అవకాశాన్ని వదులుకున్నానన్న కన్నడ బ్యూటీ
  • సినీ రంగంలో అదృష్టం కూడా చాలా ముఖ్యమని వ్యాఖ్య
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న పూర్తి స్థాయిలో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. కన్నడలో సినీ అరంగేట్రం చేసిన రష్మిక ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ డమ్ ను అందుకుంది. బాలీవుడ్ లో సైతం మెరిసింది. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక... అక్కడ వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంది. హిందీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల దక్షిణాదిలో కొన్ని ఆఫర్లను ఆమె కోల్పోతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ సినీ రంగంలో అదృష్టం కూడా చాలా ముఖ్యమని తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో, తమిళ స్టార్ విజయ్ 'మాస్టర్' సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా, ఆ అవకాశాలను చేజార్చుకున్నానని చెప్పింది. ఇంత పెద్ద స్టార్స్ తో నటించే అవకాశాన్ని వదులుకోవడం చాలా బాధను కలిగించిందని తెలిపింది. కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా టాప్ పొజిషన్ కు చేరుకోవచ్చని చెప్పింది. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగానని తెలిపింది.

Rashmika Mandanna
Tollywood
Bollywood
Chiranjeevi
Vijay

More Telugu News